మోడీ ని తిడుతూ చంద్రబాబు ని ఆకాశానికెత్తేసిన నటుడు శివాజీ..!

KSK
సినీ నటుడు శివాజీ రాజా రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఒకానొక సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీలో సభ్యుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకిపారేసిన నటుడు శివాజీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం, జాతీయ  రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


మోదీకి భారతీయ సంస్కృతీసంప్రదా యాలు తెలియవని.. గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ సెటైర్ వేశారు. కియా మోటార్స్ ఏపీకి ఇచ్చామని మోదీ చెప్పటం దారుణమన్నారు.


చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతిని చూస్తామన్నారు. ప్రధాని మోదీపై సినీ నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. మోదీ ఉడుత ఊపులకు భయపడే వారెవరూ లేరన్నారు.


నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు సమయంలో తల్లిని సైతం లైనులో నిలబెట్టిన సంస్కృతి మోదీదని ఫైర్ అయ్యారు. మోదీ చదువేంటో ఎవరికీ తెలియదని శివాజీ విమర్శించారు. దీంతో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: