జగన్ లండన్ వెళ్ళింది డబ్బుల కోసమేనా ?

Vijaya

అవుననే చెబుతున్నారు చంద్రబాబునాయుడు. కుటుంబంతో కలిసి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. లండన్ లో చదువుతున్న తన కూతురును కలుసుకునేందుకు జగన్ వెళ్ళారు. అయితే, ఈరోజు నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, డబ్బుల కోసమే జగన్ లండన్ వెళ్ళినట్లు ఆరోపించారు. హవాలా డబ్బులు తెచ్చుకునేందుకే జగన్ లండన్ పర్యటన పెట్టుకున్నట్లు చంద్రబాబు మండిపడ్డారు.

 

 ఎన్నికలకు ముందు ఎవరు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళరని కూడా సిఎం అన్నారు. అంటే ఎన్నికలకు ముందు జగన్ లండన్ వెళ్ళారు కాబట్టి హవాలా డబ్బు తెచ్చుకునేందుకే అని చంద్రబాబు తేల్చేశారు. జగన్ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో చెప్పటానికి తాజా టెలికాన్ఫరెన్సే ఉదాహరణ. ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకునేందుకే జగన్ లండన్ వెళ్ళారని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా డబ్బులు తెచ్చుకునేందుకు విదేశాలకు వెళతారా ?

 

విదేశాల నుండి డబ్బులు తెచ్చుకోవాలంటే స్వయంగా జగనే లండన్ వెళ్ళాలా ? లండన్ నుండి ఇండియాకు డబ్బులు తెచ్చుకునేందుకు చాలా మార్గాలే ఉన్నాయి. పైగా డబ్బు తెచ్చుకోవటంలో హవాలా మార్గముందని చంద్రబాబే చెబుతున్నారు. అలాంటిది హవాలా మార్గంలో డబ్బు తెచ్చుకునేందుకు జగనే స్వయంగా ఎందుకు వెళతారు ? లండన్ డబ్బులు తెచ్చుకుంటున్నారంటే ఇతరత్రా లగేజీ లాగే డబ్బులు కూడా పెట్టేల్లో పెట్టుకుని తీసుకొచ్చేస్తారన్నది చంద్రబాబు ఉద్దేశ్యమా ?

 

విదేశాలకు వెళ్ళటమంటే డబ్బుల కోసమే అన్నది వాస్తవమైతే మరి చంద్రబాబు సంగతేంటి ? ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కూడా చంద్రబాబు ఓ 20 సార్లైనా విదేశాలకు వెళ్ళుంటారు.  అందులో సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు చాలాసార్లే వెళ్ళారు. తన విదేశీయానాలు కూడా హవాలా డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చుపెట్టటం కోసమేనా ? చంద్రబాబు కాకుండా పుత్రరత్నం లోకేష్, నారాయణే కాకుండా ఇంకొందరు మంత్రులు కూడా విదేశాల్లో పర్యటించారు. వారి పర్యటనలు కూడా హవాలా డబ్బులు తేవటం కోసమేనా ? ఏదో ఒకటి మాట్లాడేసి జగన్ పై బురదచల్లేయటమే లక్ష్యంగా చంద్రబాబు టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తుండటం విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: