పవన్ కళ్యాణ్ ముందే జగన్ కి ఓటు వేయాలని కోరిన ఓ రైతు..!

KSK
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశమయ్యారు వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే ఓ భారీ బహిరంగ సభలో పత్తి రైతులు వేదికపై పిలిచి వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కి ఓ రైతు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.


ఇలాంటి సన్నివేశాలు సహజంగానే ఎవరికైనా ఇరకాటంగానే ఉంటాయి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నిశ్చేష్టుడై చూడాల్సి వచ్చింది. అధోని పత్తి మార్కెట్‌ యార్డులో రైతులతో పవన్‌ ముఖాముఖి జరిపినప్పుడు ఒక రైతు జగన్ సి.ఎమ్. కావాలని అనడంతో ఆయన, అక్కడ ఉన్న మరో నేత నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యానికి గురయ్యారు.ఒక రైతును మాట్లాడాలని పవన్ పిలిచి మైక్ ఇచ్చారు.


ఆ వృద్ద రైతు మాట్లాడుతూ 'కోతకు సిద్దంగా ఉన్న పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. పశువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పశువులు లేని ది ప్రపంచం లేదు. ఏ ఉద్యోగస్తులు లేరు' అని రైతు తన బాధలు చెప్పుకున్నారు.


ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ భజం పై చేయి వేసి మరీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని చెప్పారు. ఆయన మాటలకు ఆ సభలో పలువురు హర్షధ్వానాలు చేయడం విశేషం. దీంతో ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: