జమ్ము కాశ్మిర్ కు ప్రయోజనం కలిగించే "ఆర్టికిల్ 35-ఏ" ను భారత్ ఎందుకు వ్యతిరేఖిస్తుంది?
ఏమిటీ అధికరణం 35ఏ?
జమ్మూ కశ్మీర్లో శాశ్వత నివాసులు అన్న పదాన్ని నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ 35-ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954 లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసులను నిర్ధారించింది.
దాని ప్రకారం 1911 కు ముందు జమ్మూ కశ్మీర్లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్కు వచ్చిన వారెవరూ అక్కడ శాశ్వత నివాసులు అనకూడదు. ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకార వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు కాదు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయి. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయం లో ఇది వర్తించదు. అయితే 2002 అక్టోబర్లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో ఇలా కేంద్రం పిటిషన్
ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35-ఏ ను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన 'వి ద సిటిజన్స్' అనే స్వచ్ఛంద సంస్థ 2014 లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఆర్టికల్ 35-ఏ తమ పిల్లలకు ఓటు హక్కు లేకుండా చేస్తోందని ఇద్దరు కశ్మీరీ మహిళలు గత నెలలో సుప్రీంను ఆశ్రయించారు.
అందుకోసమే కశ్మీర్ విలీన సమయంలో 370 అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు షేక్ అబ్దుల్లా, పండిట్ నెహ్రూ హయాంలో అంగీకారం కుదిరింది. 1949లో భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చారు. తర్వాత కశ్మీరీల ప్రత్యేక హక్కులపై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో 35-ఎ అధికరణం ఏర్పాటు చేసేందుకు 1952లో నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాతే జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటైంది. కొందరు జమ్ము కశ్మీర్ రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన అధికరణాలు చెల్లుబాటు కావని కొత్తవాదం వినిపిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్-370 అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే అధికరణం- 35ఏ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో విచారించనుంది.
జమ్ము కశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ 35-ఎ అధికరణాన్ని కదిలిస్తే కశ్మీర్ లోయలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేవారే ఉండరని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ మాత్రం బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా అధికారం లోకి వచ్చినప్పుడు 370, 35-ఎ అధికరణాల గురించి నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేయాలని బీజేపీ తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Modi
-
Party
-
India
-
Article 370
-
Prime Minister
-
Sardar Vallabhai Patel
-
producer
-
Producer1
-
Congress
-
Pakistan
-
terrorism
-
Jammu and Kashmir - Srinagar/Jammu
-
monday
-
court
-
February
-
local language
-
October
-
High court
-
central government
-
venu
-
Venu Thottempudi
-
Government
-
Lawyer
-
marriage
-
Scheduled caste
-
Anupam Kher
-
Bharatiya Janata Party
-
bollywood
-
contract
-
Mehbooba
-
Deputy Chief Minister