నన్ను ఆపగల దమ్ము ఎవరికైనా ఉందా అంటున్న పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులను బలపరుస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటూ బిజీ బిజీగా తిరుగుతున్నారు పవన్.


త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ తాజా రాజకీయాల గురించి చేస్తున్న ప్రసంగాలు రాయలసీమ ప్రాంత వాసులను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం తాజా రాజకీయాలలో ప్రజల సమస్యల గురించి మరియు అవసరాల గురించి ప్రతిపక్ష పార్టీ పాత్రను జనసేన పోషిస్తోందని ఆయన చెప్పారు.


రౌడీమూకలు, ప్రైవేటు సైన్యంతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే నిలువరించే దమ్ము ఎవరికైనా ఉందా? అని ఆవేశంగా ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, సీమకు స్వేచ్ఛ ఇవ్వడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.


ఇక పవన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్రంలో జనసేన పార్టీ రాజకీయాలలో మరియు ప్రజల జీవితంలో అనేక మార్పులు తీసుకు వస్తుందని కచ్చితంగా జనసేన పార్టీ సమాజంలో మార్పు తెస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: