జగన్ - కేసీఆర్ పునాదులతో సహా కదిలిస్తా : ఏసీ సీఎం

KSK

ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలని ఐ టీ గ్రిడ్ అరస్టుల అంశం కుదిపేస్తోంది. జగన్ vs చంద్రబాబు లాగా మారాల్సిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం కెసిఆర్ vs చంద్రబాబు అయ్యి కూర్చుంది.


అర్దరాత్రి జరిగిన అరస్ట్ లూ హై కోర్టు ప్రత్యెక న్యాయమూర్తి తీర్పులతో మీడియా కి కూడా కావాల్సినంత మేత దొరికినట్టు అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం మీద జరుగుతున్న ప్రతీ పరిణామం షాకింగ్ గానే ఉంది జనాలకి. రెండు రాష్ట్రాల జనాలూ ఈ పరిస్థితి ని నిశితం గా పరిశీలిస్తూ ఉన్నారు.


ప్రస్తుతం తనమీద దాడి జరుగుతోంది అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా జగన్ కీ కెసిఆర్ కీ వార్నింగ్ ఇస్తున్నారు . చంద్రబాబు రీసెంట్ గా ఒక మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ - కెసిఆర్ ల పునాదులు కూడా కదిలిస్తా అంటూ ఆయన రేసేంట్ గా మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో ఇప్పుడు హాట్ టాపిక్.


" పక్కనుండే రాష్ట్రం అరవై సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ని డెవలప్ చేసారు.. ఇప్పుడు నా మీదనే దాడులు చేస్తున్నారు. నన్ను గనక టార్గెట్ చేస్తే మీ పునాదులు కదిలిస్తా .. మీరు ఎక్కడనుంచి వచ్చారో తేలుస్తా.. నిన్నా మొన్న డ్రామాలు చేస్తున్నారు వైకాప వాళ్ళు. ఇక్కడి ప్రతిపక్ష నేత అక్క్కడ లోటస్ పాండ్ లో ఉండి మనల్ని ద్రోహం చేస్తారు.

రీసెంట్ గా ఒక కేసు పెట్టారు మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారు అంట. ఆస్తి మనది, డేటా మనది మన ఆస్తి దొంగలిస్తే మనం బానే ఉన్నాం కెసిఆర్ కంగారు పడుతున్నాడు. మన డేటా మీద పోలీసులు దాడి చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త వదిలి పెట్టను నేను . అక్కడున్న డేటా మన వ్యక్తిగత ఆస్తి .. మీకు దొరికితే మా ఆస్తి మా దగ్గరకే పంపండి. " అంటూ రెచ్చిపోయి మాట్లాడారు చంద్రబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: