తెలుగుదేశం పార్టీ ని బంగాళాఖాతం లో ముంచండి : పిలుపునిచ్చిన జగన్

KSK
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన శంకారావం సభలో జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి లో మాట్లాడారు. "చంద్రబాబు ఎలాంటి అన్యాయం చేస్తా ఉన్నా కూడా మీరు చెయ్యాల్సింది అల్లా సి విజిల్ అనే యాప్ తో మీరు జరిగే అన్యాయం మొత్తం అందులో రికార్డ్ చేసి సెండ్ బటన్ కొట్టండి .. వెంటనే మీ దగ్గరకి 15 నిమిషాల్లో ఒక టీం వస్తుంది.

ఆ తరవాత గంట సేపట్లో ఏదో ఒక యాక్షన్ తీసుకుని నివేదిక ఇస్తారు. ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది 'ఇవాళ ఎన్నికలు జరుగుతోంది పార్టీల మధ్య కాదు .. నీతికీ అవినీతి కీ మధ్య జరుగుతోంది ..

విశ్వసనీయ త కీ అవకాసా వాదానికీ మధ్య ఎన్నికలు .. రాక్షసులకీ ప్రజలకీ మధ్య ఎన్నికలు' అనే విషయం చెప్పండి .. ఈ పరిస్థితి లో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని బంగాళాఖాతం లో కలపాల్సిందే అని ప్రతీ గ్రామం లో చెప్పండి. జరగబోయే ఎన్నికల్లో నవరత్నాలతో ప్రతీ పేదవాడి జీవితం బాగుపడాలి. ఇది జగన్ ఒక్కడి వల్లే జరిగేది కాదు. జగన్ కి మీ అందరి తోడూ కావాలి. అందరి సహాయం కావాలి." అంటూ ధ్వజం ఎత్తారు జగన్ మోహన్ రెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: