వైసీపీ గూటికి ఎస్వీ మోహన్ రెడ్డి..!
మొన్న బుట్టా రేణుక కు తాజాగా మోహన్ రెడ్డి కి టికెట్ కేటాయింపు విషయంలో మొండి చేయి చూపించిన నేపథ్యంలో..ఇప్పటికే బుట్టా రేణుక వైసీపీ గూటికి చేరారు. ఈ క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్లీ వెనక్కి రావాలని నిర్ణయించారు.
నాలుగేళ్ల పాటు టీడీపీ కోసం పనిచేస్తే, చివరి నిమిషంలో తమకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ మోసం చేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నెల రోజుల క్రితం వరకు సర్వేలు అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కేవలం డబ్బు ప్రభావంతో తమకు టికెట్ కేటాయించలేదని ఆరోపించారు. గతంలో సాక్షాత్తూ లోకేష్ తన పేరు, రేణుకమ్మ పేర్లను ప్రకటించారని, ఇప్పుడు ఇద్దరికీ టికెట్లు రాలేదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ ఆఖరి నిమిషంలో అన్యాయంచేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరి తాను పొరపాటు చేశానని, తప్పు సరిదిద్దుకోవడానికి తాను మళ్లీ వైసీపీలో చేరతానని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు.