మొదటి మంత్రిని ప్రకటించిన జగన్..?

Chakravarthi Kalyan
ఎన్నికల ప్రచారం జోరు పెంచిన జగన్.. ఆ ప్రచారంలోనే వచ్చే మంత్రివర్గానికి సంబంధించిన ప్రకటన కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన చిలకలూరిపేట సభలో మొదటిసారి ఓ నేతను మంత్రిని చేస్తా అని ప్రకటించారు. చిలకలూరిపేటను గెలిపించండి.. రాజశేఖర్‌ ను మంత్రిని చేస్తానని ప్రజల మధ్య ప్రకటించారు. 



సామాజిక న్యాయం కోసం బీసీల కోసం సీటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాజశేఖర్ ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వచ్చారని జగన్ ప్రశంసించారు. చిలకలూరిపేటతో పాటు జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తులను జగన్ ప్రజలకు పరిచయం చేశారు. 



వైసీపీ ఎన్నికల గుర్తును కూడా ఫ్యాన్ అంటూ అందరికీ చూపారు. చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే టికెట్ మహిళా ఎన్నారై రజనీ కుమారికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ జగన్ కు సహకరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 




ఇక్కడ రాజశేఖర్ బలమైన నేత అయినా సామాజిక సమీకరణాల మేరకు రజినీకి టికెట్ ఇచ్చారు. అందుకే పార్టీ కోసం త్యాగం చేసిన రాజశేఖర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ చెప్పడం విశేషం. ఎమ్మెల్యే టికెట్ మిస్సయిననా మంత్రివర్గంలో సీటు కన్ఫామ్ కావడం రాజశేఖర్‌కు ఆనందం కలిగించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: