డిల్లీ కి కే ఏ పాల్ ? కోడలితో ఇదేమి డిస్కషన్
ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఉన్న ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను ఎలర్ట్ చేసి ఢిల్లీలో కోడలితో మంతనాలు జరిపారు పాల్. అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ నీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ఆపేయాలని అలాగే నామినేషన్లు తిరస్కరణ విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న కేఏ పాల్ తో ఆ ప్రాంతంలో ఉన్న ప్రయాణికులు సెల్ఫీ లు దిగడానికి ఎగబడ్డారు. ఎవరైతే ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నామినేషన్లు వేశారో వారందరూ చాలా ఎలర్ట్ గా ఈ రోజు రాత్రి ఉండాలని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తున్నారు కేఏ పాల్. మొత్తం మీద కే ఏ పాల్ ఢిల్లీకి పయనం అవటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఆంధ్ర రాజకీయ నేతల్లో నెలకొంది.