షర్మిలపై ఇలా కూడా దుష్ప్రచారం..! బరితెగించిన పసుపు సైన్యం..?

Chakravarthi Kalyan
మంగళగిరిలో లోకేశ్ ఓటమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ప్రచారం ప్రారంభించారు. అయితే తొలిరోజు ఆమె పర్యటనలో ఓ వ్యక్తి ఆమె ఉంగరాన్ని కొట్టేయాలని ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


రోడ్‌షోలో భాగంగా స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంత మంది అభిమానులు చుట్టూ ఉన్నా ఉంగరం కొట్టేసే సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇంతకీ ఉంగరం పోయిందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. 

అయితే ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మలచుకునే పసుపు సైన్యాలు చివరకు ఈ ఘటనను కూడా వదిలిపెట్టలేదు. ఉంగరం కొట్టేసింది.. మా పార్టీ కార్యకర్తలే అని విజయమ్మ అంటున్నట్టుగా కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టు ఫేక్‌ ఫోటోలు సృష్టించారు. 

వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రెగ్యులర్ గా న్యూస్ ఛానళ్లు ఫాలో అయ్యేవారు వాటిని గుర్తించే అవకాశం ఉన్నా.. సామాన్యులు నిజమే అనుకునేలా వీటిని రూపొందించి సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్నారు. చివరకు ఉంగరం కొట్టేసే అంశాన్ని కూడా వాడుకుంటున్న టీడీపీ సోషల్ మీడియా వైఖరిని చూసి జనం అసహ్యించుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: