నారా లోకేష్ గురించి కొత్త విషయం బయటపెట్టిన లక్ష్మి పార్వతి...?
ఇదిలా ఉండగా తాజాగా లక్ష్మీపార్వతి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ కు వాళ్ల నాన్న సర్టిఫికెట్ కొనిచ్చారని... ఆ సర్టిఫికెట్ ను చదవడం కూడా లోకేష్ కు రాదని ఎద్దేవా చేశారు. ఒకటో క్లాసు పరిజ్ఞానం కూడా లేని మీ కొడుక్కి ఏకంగా మూడు శాఖలకు మంత్రిని ఎలా చేశారంటూ చంద్రబాబును నిలదీశారు.
ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని... ఇంత దుర్మార్గులకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. లోకేష్ నాయకత్వం కావాలా? లేక జగన్ నాయకత్వం కావాలా? ఆలోచించుకోవాలని అన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మకూడదని మరొకసారి మోసపోకుండా వైసిపి పార్టీని అధికారంలోకి తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు లక్ష్మీపార్వతి.