జనాలను ఓట్లడగను..చింతమనేని : ఓడించి తీరుతాము అబ్బయ్య చౌదరి

Edari Rama Krishna
దెందులూరు..గత అయిదేళ్ల తేదేపా ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదం.. ఈ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే పరిపాల, మాటలు, నడవడిక.  ప్రభుత్వ ఉద్యోగిని ఎంఆర్ఓ వనజాక్షి ఉదంతం,  ఇసుక మాఫియా గురించి, కొల్లేటి ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వ అధికారికి ధమ్కీ..SC,ST లను ఏదో అంటూ నోరు పారేసుకోవడం ఇలా చెప్పకుంటూ పోతే నెలకో ఉపద్రవం, వారానికో ఘనకార్యం, రోజుకో వార్త అన్నట్లుంటుది దెందులూరు నియోజకవర్గ పాలన పరిస్థితి.


అబ్బయ్య చౌదరి..చదువుకున్న వ్యక్తి, దేశ - దేశాలలో అనుభవం గడించి పరిపాలన అంటే ఇలా ఉడడాలని దెందులూరులో గడప - గడప కూ తిరుగుతూ ప్రజా చైతన్యం కలిగిస్తున్న నాయకుడు, సౌమ్యుడు. 


చింతమనేని ప్రభాకర్ రాజకీయ ఓనమాలు మా ఇంట్లోనే నేర్చాడంటారు అబ్బయ్య చౌదరి.  నేను దెందులూరు లోనే పుట్టాను, దెందులూరుని మోడల్ నియోజక వర్గంగా చేయడానికి నన్ను ఎమ్మెల్యే గా దెందులూరు ప్రజ తయారు గా ఉన్నారంటారు అబ్బయ్య చౌదరి.  


నేను 1500 కోట్ల రూపాయలను అభివృద్ది చేశా..నేను ఓటేయ్యమని దెందులూరు ప్రజలను అడగను..కానీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతానంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు చింతమనేని ప్రభాకర్.  ఇంత అతి విశ్వాసం, జనాలంటే పలచన చూపు పనికిరావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: