టీడీపీ కంచుకోటలో జగన్ పాగా.... బద్దలు కొట్టడమే తరువాయి !
అక్కడ ఉన్న దిగ్గజాలను డీ కొట్టడానికి వీరిని సిద్దం చేసారు జగన్.జగన్ వారి పై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము కానివ్వకుండా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అదిప్ రాజ్ అనే యువకుడిని పోటీకి నిలపెట్టరు జగన్. అక్కడ ఉన్న ప్రత్యర్థి బండారు సత్యారాయణమూర్తి కి అధిప్ రాజ్ చుక్కలు చూపిస్తున్నారు. యువజన కాంగ్రెస్ లో తొలుత చిన్న నాయకుడి గా ఉండి ఇప్పుడు వైసీపీ లో చేరి బండారు లాంటి కొండను డీ కొట్టబోతున్నాడు.
తనకున్న బలంతో వైసీపీ లో చేరక ఆ ప్రాంతంలో వైసీపీ పార్టీని పూర్తిగా బలపరిచారు అదిప్ రాజ్. దీనికి ఉదాహరణగా నిన్న జరిగిన సభలో వచ్చిన జనం చూస్తే ఔరా! అనిపిస్తుంది. ఇసుక వేసిన రాలనంత జనం వచ్చరంటేనే అర్థం అవుతుంది అదిప్ రాజ్ పోరాటం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మరో యువనేత తిలక్ కు జగన్ టిక్కెట్ కేటాయించారు. ఆయన టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏకంగా మంత్రి అచ్చేన్న నాయుడు పై పోటీ దిగుతున్నారు.
ఇక్కడ నామినేషన్ వేసేప్పుడు తిలక్ కి వచ్చిన జనాన్ని చూస్తూ మతిపోతుంది. ఇప్పుడు ప్రత్యర్థి అచ్చెన్న నాయుడు కు చెమటలు పట్టిస్తున్నారు. ఇలా పెందుర్తి టీడీపీ అభ్యర్థి కి ఎదురుగాలులు వీస్తున్నాయి, అలాగే అచ్చన్న నాయుడు కు అసమ్మతి సెగలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని అంటున్నారు.