పవన్ కల్యాణ్‌ బండారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన పోసాని..!

Chakravarthi Kalyan
తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు.. తెలంగాణలో ఆంధ్రులకు రక్షణ లేదు.. ఇంకా ఏన్నాళ్లు ఆంధ్రావాళ్లను తిడతారు. ఇంకెన్నాళ్లు ఈ తిట్లు పడాలి.. ఇవీ ఇటీవల తరచూ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు. మనల్ని తిట్టే తెలంగాణ నేతలతో జగన్ స్నేహం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు పవన్. 


ఐతే.. ఈ వ్యాఖ్యలపై రచయిత పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను కొట్టారంటున్న పవన్ ఒక్క ఉదాహరణైనా చూపాలన్నారు. అంతే కాదు.. టీఆర్‌ఎస్‌ నేతలతో స్నేహం కోసం గతంలో పరితపించిన పవనే అంటూ ఆధారాలు బయటపెట్టారు. 

పవన్ కల్యాణ్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి కలవడాన్ని,... కేసీఆర్ స్ఫూర్తిని ఆంధ్రుల తీసుకోవాలని చెప్పిన వీడియోలను ప్రదర్శించారు. కేటీఆర్, కవితలతో ట్విట్టర్‌లో జరిపిన పరస్పర మెచ్చుకోళ్ల ను చూపించారు. ఇవన్నీ చేసిన పవన్ ఇప్పుడు ఓట్ల కోసం దిగజారడం సరికాదన్నారు. 

ఆంధ్రా బిడ్డలను తెలంగాణ వాళ్లు తరిమితరిమి కొడుతుంటే ఎప్పుడు అడ్డుకున్నావ్?. నువ్వు గెలవడం కోసం, ఓట్లు రావడం కోసం తెలంగాణ వాళ్లను నిందిస్తావా?. ఆంధ్రవాళ్లను ఎవరు కొట్టారో ప్రజలకు రుజువు చేయాలి. పవన్ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణ వాళ్లు ఆంధ్రాకు వచ్చి కొడుతున్నారా?. ఆంధ్రా వాళ్లను కొడుతుంది, చంపుతుంది ఆంధ్రావాళ్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: