కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అత్యంత ప్రతిభగల విద్యార్థులు ఫెయిల్ కావడం ఓ వైపరీత్యమైతే, అంతకు మించిన దారుణం 17 మార్కులతో ఫెయిలయిన విద్యార్థిని 'పాస్' కోటాలోకి వేసెయ్యడం. ఇంతటి గందరగోళం కారణంగానే ఈసారి తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన తలనొప్పుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్ చొరవతో పోయిన ప్రాణాలు తిరిగిరావుగానీ, కొంతమేర విద్యార్థులు ఊరట పొందే అవకాశమైతే వుంది. కానీ, అత్యంత జుగుప్సాకరమైన ఈ తప్పిదం విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాల్సిందే.
విద్యా శాఖ మంత్రి సహా, కీలక అధికారులు చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలకూ తగిన 'శాస్తి' జరగాల్సి వుంది. మరి, కేసీఆర్ అంత సీరియస్ యాక్షన్ తీసుకోగలరా.? ఇక్కడితో ఈ ఇంటర్మీడియట్ రచ్చ చల్లారుతుందని అనుకోవచ్చా.? ఏమో, వేచి చూడాల్సిందే. ఏదిఏమైనా, ఇంటర్ బోర్డ్పైనా, ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి వుంటే, చాలామంది విద్యార్థుల బలవన్మరణాలు ఆగేవేమో.!