అదృశ్యమైన విద్యార్థిని దారుణ హత్య..
గంటలు గడిచాయి.. రోజు వచ్చే సమయం కూడా దాటింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలిక కోసం ఆరా తీశారు. ఎంతకు ఆమే ఆచూకి లభించక. పోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి వళ్లిన శ్రావణి శవమై కనిపించింది.
దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే బావిలో శ్రావణి స్కూల్ బ్యాగ్ తో పాటు బావి పక్కన మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారా.. లేక కావాలని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీంతో డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్లు రంగంలోకి దిగాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.