రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నాగిరెడ్డి గూడ తండాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నాగిరెడ్డి గూడా తండాకు చెందిన నుంసావత్ దేశ్య, విజయ దంపతులకు నలుగురు సంతానం. అయితే పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి.. ఊరికి వెళ్లారు దంపతులు. దీంతో పెద్దామ్మాయి రెండో అమ్మాయి.. ఓ బాబు ఆడుకునేందుకు వెళ్లారు. ఇక అనారోగ్యంతో న్న మరో ఏడేళ్ల బాలిక ఇంట్లోనే ఉంది. ఇదే అదనుగా చూసిన అదే గ్రామానికి చెందిన అరుణ్.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు అరుణ్ 10 వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత నాగిరెడ్డి గూడ తండాలోనే జులాయిగా తిరుగుతున్నట్లు పోలీసులు వివరించారు. బాధితురాలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.