రెండేళ్లుగా ఒక వ్యక్తి వేరొకరి భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇంట్లో వారు రెడ్ హ్యండేడ్గా గదిలో అసభ్యకర స్థతిలో దొరికొపోయారు. దీంతో వారుంటున్న రూమ్కు తాళం వేశాడు ఆమె భర్త. దీంతో భయపడిపోయిన వ్యక్తి ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకాడు. దక్షణి ఢిల్లీలోని తిగాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా.. ఆ మహిళ భర్త తుగ్లకాబాద్లో కస్టమ్ క్లియరెన్స్ ఏజెంట్ వద్ద పనిచేస్తున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి పేరు పంకజ్ అని తెలిపారు. అతను కూడా జేజే కాలనిలోనే ఉంటున్నాడని.. అయితే ఆ మహిళ ఒంటరిగా ఉన్న టైమ్లో పంకజ్ ఆమె ఇంటికి తరచూ వెళ్లేవాడని.. ఇంతలోనే ఆమె భర్త తిరిగి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇక వారిద్దరిని అభ్యంతరకర స్థితిలో చూసిన భర్త ఆమెను గువ్వ గుయ్యిమనిపించాడు. చెంప చల్లుమనిపించాడు. ఈ క్రమంలో ఆ మహిళ తన నరాలను కోసుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు భర్త. ఆమె భర్తతో పాటు పంకజ్ కూడా కాపాడే ప్రయత్నం చేశాడు.
అయితే అతడి భార్య నటిస్తుందని భావించిన భర్త.. వారిద్దరిని చూసిన గదిలోనే ఉంచి బయట డోర్ లాక్ చేశాడు. ఈ విషయాని ఆమె తండ్రి, సోదరునిడి చెబుతానని హెచ్చరించాడు కూడా. ఈ క్రమంలో ఆ వ్యక్తికి భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తొందరలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాల్కనీలోకి వచ్చి కిందకు దూకాడు.
తప్పించుకునే ప్రయత్నంలో ఆ వ్యక్తి కిందకు దూకగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పంకజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంకజ్ కూడా వివాహితుడేనని అయినా.. ఈ మహిళతో రెండేళ్లుగా అక్రమం సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించిన ఫోన్తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.