పవన్ కు దెబ్బ మీద దెబ్బ

Reddy P Rajasekhar


2019 ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు. ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ రెండు చోట్లా ఓడిపోవటంతో ఎమ్మెల్యేగా ఎంపిక కాలేకపోయాడు పవన్ కల్యాణ్. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో గెలిచి ఉంటే జనసేన పార్టీ పరిస్థితి మరో విధంగా ఉంది.

 

పవన్ కల్యాణ్ అన్న నాగబాబును ఎంపీగా పోటీ చేయించాడు. తను కూడా ఎన్నికల్లో గెలవకపోవటంతో గత కొన్ని రోజులుగా దూరంగా ఉన్న జబర్దస్త్ షోకు వెళ్ళిపోయాడు. పవన్ కల్యాణ్ మనసులో మాత్రం అన్న రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలని టీవీ సినిమా రంగాలకు తనలా దూరంగా ఉండాలని పవన్ భావించాడట.

 

ఇదే సమయంలో పార్టీలో ఉన్న ప్రముఖుల్లో ఒకడైన రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేయడం జనసేనకు మరొక ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి జనసేనలో ప్రముఖులుగా నాదెండ్ల మనోహర్ మాత్రమే మిగిలి ఉన్నారు. పార్టీలో ముఖ్యులు పార్టీకి రాజీనామా చేస్తే అది పార్టీ భవిష్యత్తుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: