ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ లను తగ్గించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో మంత్రులకు ఫిష్ట్ కు ఇద్దరేసి చొప్పున నలుగురు గన్ మెన్ల రక్షణ ఉండేది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఇదే పద్ధతి కొనసాగింది. ఆపై నిన్న ఉదయం నుంచి పలు జిల్లాల్లో గన్ మెన్లను రిపోర్ట్ చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రాతపూర్వక నిర్ణయం లేకుండా, నోటి మాట ద్వారా సెక్యూరిటీ ఉపసంహరణ ఉత్తర్వులు శుక్రవారమే వెలువడ్డాయని తెలుస్తోంది.