అవినీతికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదు : సీఎం జగన్
వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని జగన్ ప్రకటించారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. కొత్తగా 650 అంబులెన్స్లు కొనుగోలు చేస్తామని, ఉగాది రోజున మహిళల పేరుతో రూ. 25లక్షల ఇళ్లకు పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు.
లబ్దిదారుడు లంచాలు ఇచ్చే పరిస్థితి పోవాలని, ఆగస్టు 15న 4లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం జరుగుతుందని, గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు సీఎంవోలో కాల్సెంటర్ ఎర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తూ జీవో ఇచ్చామని, సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేశామని జగన్ పేర్కొన్నారు.