నేడు ఏపి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నాయకుల మద్య హూరా హూరీ మాటల యుద్దం నడుస్తుంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్ జగనన్న’ అని మత్య్సకారులు చెబుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవల జరిగిన లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఒకే ఒక్క సీటు గెల్చుకుంది.
ప్రస్తుతం ఏపి అసెంబ్లీలో టీడీపీతో పాటు జనసేన పార్టీ తరుపు నుంచి ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొనసాగుతున్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్ నిధులు కేటాయించడం సంతోషమన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు.
108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదు.పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బడ్జెట్ రూపొందించార’ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందని రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.