తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటీవల వరుసగా ఎన్నికల పర్వం కొనసాగింది. లోక్ సభ, రాజ్య సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ సత్తా చాటుతున్న సమయంలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చాయి. ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జరిగాయి..ఇక్కడ కూడా టీఆర్ఎస్ తన ఆదిపత్యాన్ని కొనసాగించింది.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగడానికి సన్నద్దం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఉపసర్పంచ్లకు చెక్పవర్ రద్దు చేయాలని సర్పంచులు ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమాన్ని బహిష్కరించిన సర్పంచులు గొల్లపల్లి రోడ్ హైవే వద్ద ధర్నా చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి 380 మంది సర్పంచ్లను అరెస్ట్ చేశారు.