ఒక్కరు కాదు ముగ్గురూ..అత్యాచారం చేస్తూ వీడియోలు తీసిన క్రూరులు.
చిత్తురూ జిల్లాలో కురబాలకోట దగ్గర వున్న,అంగళ్ళు అనే గ్రామానికి చెందిన విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు కామాంధులు కలిసి అత్యాచారానికి పాల్పడడం మండలంలో కలకలం రేపింది.కురబాలకోట రూరల్ సీఐ అశోక్ కుమార్ కథనం మేరకు అమ్మాయి,దొమ్మన్నబావి దగ్గర గల కనికిలిబావి దగ్గరికి ఈనెల 3వ తేది సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వెళ్లడం చూసిన ఆ వూరి కుర్రాళు పథకం ప్రకారం ఆప్రదేశంలో ఎవ్వరు లేని సమయం చూసి,వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని భయపెట్టి తరిమేసి,ఆ అమ్మాయిని బెదిరించి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు క్రూరంగా ఆగకుండా ఆంబోతుల్లా అత్యాచారం చేసారట,
అక్కడితో ఆగకుండా అత్యాచారం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని,మీ తల్లిదండ్రిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు.ఆ రోజునుండి మానసిక వేదనతో కుమిలిపోతూ పిచ్చిదానిలా తయారైన కూతుర్ని గమనించిన తల్లి గట్టిగా అడగటంతో భయపడుతూ జరిగింది చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందట,స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి అదేరోజు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు.