టుడే టాప్ 10 న్యూస్
మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. ఈ వార్తలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగుతోంది. ఇంటిలిజెన్స్ వర్గాలు ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. ఉగ్రవాదుల ఏ ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకున్నారో ? కూడా చెపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది.
పూర్తి వివరాలకు https://bit.ly/2U7ukuo
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు జైట్లీ. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 8న ఎయిమ్స్లో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స అందించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2ZauIxU
వరద బాధితులంటే అధికారులకు ఎంత అలుసో తెలియజేసే సంఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది . వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అధికారులు, వారిని మరింత క్షోభకు గురిచేసేలా వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లను అందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2ZxR77S
ఏపీలో వైఎస్ జగన్ 70 రోజుల పాలనపై భిన్న వాదనలు ఉన్నాయి. బాగుందని కొందరు అంటే దశా దిశా లేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలనపీ ఏకగ్రీవ అభిప్రాయం మాత్రం లేదు. అయితే పాలన ఇంకా మొదలు కాలేదని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతూంటే తొలి రెండు రీళ్ళు సిన్మా చూసి ఫ్లాప్ అనేస్తున్న వారు మరికొందరు. ఈ జాబితాలో టీడీపీ పక్కన బీజేపీ కూడా నిలిచింది. బీజేపీకి జగన్ పరిపాలన అసలు నచ్చడంలేదుట. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2MCWtse
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి ప్రశంసల చిహ్నంగా ప్రధాని నరేంద్రమోదీకి యుఎఇ లోని అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ తో శనివారం సత్కరించారు. ఈ అవార్డును ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్ II మరియు చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ సహా పలువురు ప్రపంచ నాయకులకు అందజేశారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/30vy0Iz
గత వారం రోజులుగా రాజధాని అమరావతి విషయంలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరదలు వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు తగ్గట్టుగా మంత్రి సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటనలు రాజధాని విషయంలో ప్రజలని అయోమయంలో పడేశాయి. వరద ముంపు ఉంది కాబట్టి రాజధాని నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని, మార్పు విషయంమై ఆలోచిస్తున్నామని మంత్రి ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2L2JHA2
ఇటీవల బీజేపీ లో చేరిన దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ ఎంత హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసు. మొన్నటివరకు టీడీపీలో కీలక పాత్ర పోషించిన సుజనా బీజేపీలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ హైలైట్ అవ్వాలని అనుకుంటున్నారు.పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2PcfvYr
శ్రీశాంత్ నివాసంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం ఎడపల్లిలో ఉన్న శ్రీశాంత్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుఝామున 2 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ నివాసంలో లేడు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం. అతని భార్యా, పిల్లలు నిద్రలో ఉన్న సమయంలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2PdegbH
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Terrorists
-
News
-
Sri Lanka
-
Friday
-
central government
-
Minister
-
Heart
-
oil
-
Guntur
-
Jagan
-
YCP
-
TDP
-
Bharatiya Janata Party
-
UAE
-
Prime Minister
-
Saturday
-
Russia
-
Queen
-
Capital
-
V Vijayasai Reddy
-
Rajya Sabha
-
Sujana Choudary
-
Sreesanth
-
Thiruvananthapuram
-
Cinema
-
Party
-
Kolloor
-
Ram Madhav
-
Father
-
Sultan
-
prasanth
-
Prashant Kishor
-
India
-
Industry
-
Mass
-
Chitram
-
Saira Narasimhareddy
-
Raccha
-
KGF