చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు... ఆసుపత్రిలో చేర్పించాల్సిందే :ఎమ్మెల్యే రోజా

praveen

చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై టిడిపి అధినేత,  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరు సరికాదంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన విమర్శనాస్త్రాలు గుప్పించారు. చిత్తూరు జిల్లా నగరి లో మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని   ఘాటుగా విమర్శించారు . విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో  జారీ చేసిందని తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తమ ప్రభుత్వ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని మాట్లాడటం సరైందికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ... ఈ నేపథ్యంలోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన మాట ప్రకారమే ఐదు జీవోలను జగన్ రద్దు చేశారని రోజా తెలిపారు. కానీ తమ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు మతిస్థిమితం లేనివాడిలా  మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. అయితే చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారో  లేక మతిమరుపు వచ్చిందో తెలియడం లేదని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన అవసరం ఉందని. అయితే ఏ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలో ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని విమర్శించారు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పాలన నడుస్తోందని చంద్రబాబు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని... ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పారదర్శక పాలన జరుగుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు. అయితే టీడీపీ చేస్తున్న అనవసర ఆరోపణలు పై సీఎం జగన్ స్పందించకపోవడంతో టిడిపి నేతలకు పిచ్చెక్కిపోతుందని రోజా విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: