ప్రారంభం కానున్న వైఎస్సార్ కంటివెలుగు పథకం ఎప్పుడంటే ?

venugopal Ramagiri
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘కంటివెలుగు’పథకాన్ని ఏపీ సర్కార్ కూడా అమలు చేయనుంది. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద రూ.560 కోట్లతో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 10న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంత‌పురం జిల్లాకు  రానున్న ఈ క్ర‌మంలోనే ఈ పధకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రారంభకానుంది. వరల్డ్ సైట్ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే మొత్తం మూడేళ్లపాటు అమలవుతున్న. ఈ కంటివెలుగు పథకాన్ని 5 దశల్లో అమలు చేయనున్నారట.. ఇక కంటివెలుగు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఛైర్మన్‌గా టాన్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంటి వెలుగు పథకాన్ని తొలి రెండు దశల్లో విద్యార్థులకు అమలు చేస్తారు. తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.


పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు, మందుల్ని ఇప్పటికే  సిద్ధం చేశారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఈ ఆపరేషన్ల కార్యక్రమాన్ని జిల్లా నుంచే సీఎం ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.


ఇకపోతే అనేక ఉపయోగకరమైన పధకాలతో ఇప్పటికే ప్రజల మనసుల్లో సుస్దిర స్దానాన్నిసంపాదించుకున్న జగన్ కంటివెలుగు పధకంతో మరోసారి పేదల కళ్లల్లో వెలుగును నింపుతున్నాడు.ఇక ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా  అమలు  చేస్తూ ముందుకెళ్లుతున్నారు  ఏపి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: