మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు అక్టోబర్ 21 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉన్నది. రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ముందస్తు సర్వేలు చెప్తున్నాయి. సర్వేలను అనుసరించే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.
బీజేపీ, శివసేనల కలిసి మహారాష్ట్రలో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు, రెండు పార్టీల నేతలు ఎన్నికల హామీలను కూడా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ ముఖ్యంగా జాతీయ భద్రతా, ఎన్ఆర్సి, ఉద్యోగాలు, డిజిటల్, రైతు పధకాలపై ప్రచారం చేస్తున్నది. అదేవిధంగా జాతీయ స్థాయిలోని నేతలైన ప్రధాని మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.