ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత నిత్యం కొత్త కొత్త మొబైల్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రోజుకో కొత్త మొబైల్ బయటకు వస్తున్నది. తక్కువ ధరల్లో లభించే ఆ మొబైల్స్ మనిషికి హాని కలిగించే అవకాశం ఉన్నది. హాని కలిగించే అవకాశం ఉన్నది. ఎన్ని కొత్త బ్రాండ్స్ వస్తున్నా.. యాపిల్ మొబైల్ కు ఎప్పుడు వ్యాల్యూ తగ్గదు. దాని బ్రాండ్ దానికే ఉంటుంది. యాపిల్ సంస్థ నుంచి సంవత్సరానికి ఒకటి రెండు కొత్త మొబైళ్ళు రిలీజ్ చేస్తుంటారు.
ఇక ఇదిలా ఉంటె, ఈ యాపిల్ సంస్థకు చెందిన ఓ మొబైల్ ఫోన్ ను రష్యాకు చెందిన రాజు మిలాప్ అనే ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఓ మొబైల్ యాప్ ద్వారా ప్రయత్నించకుండా ఏ విషయంపైనా తప్పుడు నిర్ణయం తీసుకోకండి అని ఉంది. ఆ కొటేషన్ అతన్ని బాగా ఎట్రాక్ట్ చేసింది. వెంటనే ఆ వ్యక్తి ఆ మెసేజ్ లింక్ ను ఓపెన్ చేశాడు. విచిత్రంగా ఆ వ్యక్తికీ బిట్ కాయిన్స్ మాదిరిగా ఉన్న గే కాయిన్స్ వచ్చాయి.
అవి ఒకటి కాదు రెండు కాదు.. 14,36,322 రూపాయల విలువచేసే గే కాయిన్స్. వాటిని వినియోగించుకునే క్రమంలో అతనికి మరొక గే తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. మరి కొంతమందితో పరిచయం ఏర్పడింది. గే సంబంధాలు కొనసాగుతుండటంతో భయపడ్డాడు. తన తల్లిదండ్రులకు తెలిస్తే ఏమౌతుందో అని భయపడి కోర్టులో కేసు దాఖలు చేశాడు.
తాను ఇలా మారిపోవడానికి యాపిల్ కంపెనీనే కారణం అని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అయితే,యాపిల్ సంస్థ తమకు ఎటువంటి సంబంధం లేదని, అది థర్డ్ పార్టీ యాప్ అని చెప్పింది. గతంలో ఇలానే ఓ వ్యక్తి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మీద కేసు దాఖలు చేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులను అధికంగా వాడటం వలన ఓవర్ వెయిట్ పెరిగిపోయానని, అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి కేసు ఫైల్ చేశాడు. విచారించిన కోర్టు అతనికి 56వేలకోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పును ఇచ్చింది.