కిడ్నాప్‌కు దారితీసిన పబ్‌జీ ఎఫెక్ట్‌

Sirini Sita
ప్రస్తుతం పబ్‌ జీ విద్యార్థుల పాలిట చాల పెద్ద శాపంగా మారింది. పబ్‌జీ ఆడుతున్న సమయంలో వద్దన్నందుకు నీ కొడుకును కిడ్నాప్‌ చేశారని కన్నా  తల్లికే ఓ ఇంటర్‌ విద్యార్థి ఫోన్‌ చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా రాయదుర్గం పోలీసులు పట్టు కోవడం జరిగింది. హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే సమీర్‌ ఆర్మన్‌(16) నార్సింగిలోని జాహ్నవి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. 


కాలేజీ అనంతరం సాయంత్రం సమయంలో షేక్‌పేట్‌లోని ఆకాశ్‌లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు చేస్తున్నాడు.  తండ్రి అల్తఫ్‌ ఆస్ట్రేలియాలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌గా తన వృత్తి నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా సమీర్‌ పబ్‌ జీ ఆడుతూ చదువును బాగా నిర్లక్ష్యం చేశాడు. ఈ విషయం  గమనించిన తల్లి పబ్‌జీ ఆడవద్దని మందలించి సెల్‌ఫోన్‌ తీసుకుంది. దీంతో సమీర్‌  మనస్తాపానికి గురైన మణికొండలోని స్నేహితుడు సిద్ధార్థ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని తల్లికి  చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు.


అయితే బ్యాంక్‌లో రెండు వేల నగదు తీసుకొని రాత్రి 9.30 ఇమ్లీబన్‌ బస్‌ స్టేషన్‌ నుంచి   ముంబై బయటుదేరాడు బస్సులో సమీర్. తెల్లవారు జామున 5.30 గంటలకు షోలాపూర్‌లో దిగి బాత్‌ రూమ్‌కు వెళ్లి వచ్చే సరికి  బస్సు వెళ్లిపోవడం జరిగింది. ఏమి చేయాలో పాలుపోక అక్కడున్న వారి  బస్సులో సెల్‌ ఫోన్‌ తీసుకొని ఉదయం 7 గంటలకు సమీర్ తల్లికి ఫోన్‌ చేశాడు. నీ కొడుకును కిడ్నాప్‌ చేశాం, నీ కొడుకు అంటే నీకు ప్రేమ లేదా అంటూ అర్జంట్‌గా మూడు లక్షల రూపాయలు మాకు పంపాలని తెలిపారు, ఈ ఫోన్‌ నంబర్‌కు మళ్లీ మళ్లీ పోన్‌ చేయవద్దని కూడా చెప్పాడు. 


కానీ సమీర్ తల్లి మాత్రం పెద్దగా స్పందించలేదు. శనివారం ఉదయం  అక్కడి 7.30 గంటలకు బయలుదేరి బస్సులో మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌కు వచ్చాడు. సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. దింతో ఇంట్లో ఉన్న ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో తల్లి ఆశా చూసి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మాచెర్లకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చున్న సమీర్‌ను రాయదుర్గం పోలీసులు చూసి పట్టుకున్నారు. రాత్రి తల్లి ఆశకు సమీర్‌ను అప్పగించడంతో కథ ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: