కొందరికి ఉండే ప్రచార యావను చూస్తుంటే..నవ్వొస్తుంది. వారికి ప్రచార పిచ్చే ఉందా? ఇంకేదైనా పిచ్చికూడా ఉందా అనే సందేహం వస్తుంది. అలాంటి సందేహమే తాజాగా ఈమెను చూస్తుంటే...పాకిస్థాన్ పాప్ సింగర్ రబీ పిర్జాడా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారడమే ఈ కామెంట్లకు కారణం. ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి భారత్ పై విషం కక్కుతోంది. కశ్మీర్ పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్లు చేస్తోంది. గత నెల 15న ప్రధాని మోడీపై ఆమె విషం కక్కింది. పాములను పట్టుకుని చూపిస్తూ వాటిని ఆయనపై వదిలి కరిపిస్తానంటూ వీడియో పోస్ట్ చేసింది. తాజాగా...ఏకంగా పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో పెట్టింది.
లాహోర్ కు చెందిన సింగర్ అయిన ఫిర్జాదీ తాను కశ్మీరీ బిడ్డనంటూ, మోడీని హిట్లర్ తో పోలుస్తూ సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో పెట్టింది. పాక్ సింగర్ రబీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీన్ని మెచ్చుకుంటూ కొందరు పాకిస్థానీలు రీట్వీట్లు చేశారు. కొంతమంది పాక్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నావంటూ తిట్టిపోశారు. భారతీయులు కూడా ఆ ట్వీట్ పై స్పందించారు. కశ్మీరీలు భారత్ లో సేఫ్ గా ఉన్నారని, ఇలాంటి సేఫ్టీ కావాల్సింది పాకిస్థానీలకే అని కామెంట్లు పెట్టారు. ‘ఇది మీ నేషనల్ డ్రస్’ కదా అంటూ చాలా మంది సెటైర్లు వేశారు. మీ ట్రెడిషనల్ డ్రస్లో చాలా అందంగా ఉన్నావ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రస్ ని ప్రపంచమంతా చూస్తోందంటూ మరికొందరు ఘాటుగా కామెంట్ చేశారు.
ఇదిలాఉండగా, గతంలో కొండ చిలువలు, మొసళ్లని చూపిస్తూ కశ్మీర్లో మోడీ చేస్తున్నదానికి.. వీటితో కరిపిస్తానంటూ రెచ్చిపోయింది. అయితే ఆ తర్వాత ఊహించని షాక్ ఎదుర్కుంది. క్రూర జంతువుల్ని ఇంట్లో పెంచడం నేరమని పాక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ కూడా కేసు పెట్టింది. జంతువులను ఇంట్లో పెట్టుకుని వాటితో వీడియో చేయడంపై పాక్ కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేసింది. అయినప్పటికీ.... ప్రచార `పిచ్చి`తో ఆమె తిరిగి తీవ్ర వివాదాస్పదంగా ప్రవర్తించింది.