మహారాష్ట్ర, హర్యానాలో వార్ వన్సైడేనా?
మహారాష్ట్ర, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలుంటాయా? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రేపు ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. మహారాష్ట్ర, హర్యానాలో వార్ వన్సైడేనా? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు? ఓట్ల లెక్కింపుతో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. {{RelevantDataTitle}}