తెలంగాణలో నేటి నుంచి పవన్ ప్రచారం

Chowdary Sirisha
బిజెపి, తెలుగుదేశం కూటమికి మద్దతుగా తెలంగాణలో గురువారం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యతో కలిసి పవన్ ప్రచారంలో పాల్గొంటారు. తొలి విడతగా తెలంగాణలోని 45 నియోజకవర్గాల్లో, ఆ తర్వాత సీమాంధ్రలో కూడా పవన్ ఎన్డీఎ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారని తెలిసింది. మల్కాజిగిరి ఎంపి అభ్యర్థిగా బిజెపి బలపరిచిన తనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడం సంతోషకరమని టిడిపి అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఎన్డీఎ కూటమికి మద్దతు ప్రకటించినందుకు ఈ సందర్భంగా మల్లారెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు మద్దతుగా మల్కాజిగిరి నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారన్న ఊహాగాహాలకు తెరపడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: