నందిగామ ఎన్నిక ఏకగ్రీవం కోసం యత్నాలు

Chowdary Sirisha
నందిగామ శాసనసభ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని వై.ఎస్ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను తెలుగుదేశం పార్టీ కోరింది.ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ ఈ మేరకు జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై పార్టీలో చర్చించి సమాధానం చెబుతామని జగన్ చెప్పినట్లు సమాచారం.కాగా ఆళ్లగడ్డ ఉప ఎన్నిక వచ్చినప్పుడు టిడిపి సహకరిస్తుందనే హామీ లభిస్తే నందిగామ ఎన్నిక బరి నుంచి తప్పుకోవడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు. కాగా ఇప్పటికే టిడిపి తన అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: