మాజీ ఎంపీ ఆత్మహత్యాయత్నం !

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన ప్రస్తుతం కోల్ కతా జైల్లో ఉన్నారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. కునాల్ ఘోష్ పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా శారద స్కాం ఛార్జ్ షీట్ లో తన పేరును సీబీఐ అన్యాయంగా చేర్చిందని కునాల్ ఆరోపించారు. కునాల్ ఈనెల 24న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: