టీ స్పీకర్ పై అవిశ్వాసం?

అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. తొలుత సభలో సభ్యుల హక్కులను కాపాడాలని స్పీకర్ కు ఓ లేఖ రాయాల్సిందిగా నిర్ణయించారు. బీఏసీ సమావేశానికి ఎవరు హాజరు కావాలనే అంశంపై ప్రభుత్వం చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొంటున్నట్లు టీ టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. సభ్యుల హక్కుల గురించి స్పీకర్ వైపు నుంచి సానుకూల సమాధానం రాకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: