వెంకయ్యకు ఇంకా ప్రేమలేఖలొస్తున్నాయంట...

Chakravarthi Kalyan
                               బీజేపీ జాతీయ నేతల్లో కీలకమైన వారిలో వెంకయ్యనాయుడిది అగ్రస్థానమే.. ఉత్తరాదినేతల డామినేషన్ ఎక్కువగా ఉండే.. బీజేపీలో కీలకమైన నేతగా ఎదిగిన దక్షిణాది నాయకుల్లో ఆయనదే టాప్ ప్లేస్. బీజేపీ వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరుంది. చిత్తశుద్ధి, కష్టపడే తత్వంతో పాటు అనర్ఘళమైన వాగ్దాటి వెంకయ్యనాయుడుకు ప్లస్ పాయింట్స్. అంత్యప్రాసలతో కూడిన ఆయన ప్రసంగం.. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటుంది.                                మోడీ మంత్రివర్గంలో పార్లమెంటరీ మంత్రిగా ఆయన ఇప్పుడు మరింత కీలక బాధ్యతలు మోస్తున్నారు. సభను సజావుగా నడపడంలో మంచిమార్కులే కొట్టేస్తున్నారు. సభలో వాడి వేడి సమావేశాలు జరుగుతున్న సమయంలో.. తన వ్యాఖ్యలతో సభవాతావరణాన్ని తేలిక పరచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మంగళవారం కూడా సభలో వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో.. తనకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తాయంటూ ఆయన చేసిన కామెంట్స్ సభలో నవ్వులు పూయించాయి.                              ఢిల్లీలోని అనధికార కాలనీలను క్రమబద్దీకరించే బిల్లు విషయంలో ఇటీవల వెంకయ్య చొరవ తీసుకున్నారు. ఈ విషయంపై ప్రసంశిస్తూ వెంకయ్యను వెంకయ్యను ప్రేమిస్తున్నా అంటూ దక్షిణ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ సభలో ఓ పాట పాడారు. దీనిపై స్పందించిన వెంకయ్య.. ఇప్పటికీ తనను ప్రేమిస్తున్నానంటూ లేఖలొస్తాయని.. వాటిని తన భార్య అపార్థం చేసుకోదని ఛలోక్తులు విసిరారు. యువకుడుగా ఉన్నప్పటి నుంచి నన్నెంతో మంది ప్రేమిస్తున్నారు. ఇప్పటికీ ప్రేమలేఖలు రాస్తున్నారని కామెంట్ చేశారు. కాకపోతే ఈ ప్రేమలేఖలు రాజకీయ అంశాలకు సంబంధించినవే సుమా.. అంటూ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: