ఆయనను చూసి టీడీపీ నేతలంతా కుళ్లిపోతున్నారు !

Padmaja Reddy

పరకాల ప్రభాకర్... ఎక్కడ నుంచి ఊడిపడ్డాడో కానీ.. ఏపీలో బాబు ప్రభుత్వం ఏర్పడగానే ఆ ఆస్థానంలో స్థానం సంపాదించాడు. ప్రభుత్వ సలహాదారుల్లో ఒకడిగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ కోసం పాటు పడకపోయినా... ఆ పార్టీని గెలిపించడానికి ప్రయత్నించకపోయినా పరకాలకు ఆ అవకాశం లభించింది. మరి అదంటే ఏదో సాదాసీదా అదృష్టం అనుకోవాలి.

అయితే ఇప్పుడు ఏకంగా ఈయనకు మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. పరకాలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసి.. మంత్రిగా చేయనున్నారట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఒక పుకారు హల్ చల్ చేస్తోంది. త్వరలోనే పరకాల ప్రభాకర్ బాబు క్యాబినెట్ లో మంత్రి కానున్నడానేది ఆ పుకారు సారాంశం.

మరి పరకాలది చాలా అదృష్టమనే చెప్పాలి. పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడెప్పుడూ పరకాల ఆ పార్టీ లో లేడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పనిచేసి తెలుగుదేశం పై దుమ్మెత్తిపోశాడు కూడా. ఇక సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కూడా పరకాల తెలుగుదేశం స్టాండును విమర్శించాడు. అయితే తీరా ఎన్నికలయ్యి టీడీపీ అధికారంలోకి వచ్చాకా మాత్రం ఈయన దశ తిరిగింది.

మరి దీని వెనుక కేంద్రమంత్రి అయిన పరకాల భార్య ప్రభావం కూడా చాలానే ఉండవచ్చు. అయితే ఇది సగటు తెలుగుదేశం నేతల్లో మాత్రం అసూయనే పుట్టిస్తోంది. దశాబ్ధాలుగా పనిచేస్తున్న తమకు దక్కని అవకాశాలు పరకాలకు దక్కే సరికి వారికి మండిపోతోంది. అయితే ఎవ్వరూ ఏమీ చేయలేరంతే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: