బాబు ‘జాయ్ ఫుల్‌ లివింగ్’

Chowdary Sirisha

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోగా బాట పట్టారు. ఆయనతో పాటు ఆయన సహచర మంత్రులు, జిల్లాలకు చెందిన నేతలు, అధికారులందరూ జాయ్‌ ఫుల్‌ లివింగ్ యోగాలో శిక్షణ పొందుతున్నారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైబసిటీ కనెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఒత్తిడిని ఎదుర్కోవడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వివిధ స్థాయిల్లో అందరూ ప్రజా సేవ చేస్తున్నారనీ... అలాంటప్పుడు విపరీతమైన స్ట్రెస్ ఉండటం సహజమన్నారు.

ఒత్తిడి వల్ల ఏకాగ్రత ఉండదని చెప్పారు. యోగా వల్ల ఒత్తిడి దూరమవడమే కాకుండా చాలా జబ్బులు కూడా అదుపులోకి వస్తాయన్నారు. అటు జగ్గీ వాసుదేవ్ కూడా ఒత్తిడిని దూరం చేసుకుంటే ప్రజల సమస్యలను ఇంకా సులువుగా పరిష్కరించే వీలుంటుందన్నారు.

అందుకు ఈ యోగా శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: