ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్... భార్య సహా పూజారి అదృశ్యం

Chowdary Sirisha

చిత్తూరు జిల్లా మదనపల్లెలో నేటి ఉదయం కలకలం రేగింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ పూజారి సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పెట్టి భార్య సహా అదృశ్యమయ్యాడు. దీనిపై సుమోటో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూజారి దంపతుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకెళితే...

పట్టణంలోని బర్మా వీధిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న శివస్వామి, తన భార్య జ్యోతితో కలిసి నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.తాజాగా అతడి సూసైడ్ నోట్ ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది.

ఆలయ ధర్మకర్తలు మందలించిన కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూజారి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. సాయిబాబా ప్రతిమతో కలిసి ఫొటో తీయించుకున్నానని, ఈ కారణంగా ఆలయ ధర్మకర్తలు తనను దూషించారని ఆయన ఆ నోట్ లో తెలిపాడు.

....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: