టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు మోడీని పొగిడేశారు!

padmaja reddy
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశంసించడం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు కొత్త కాదు. ఈయన గతంలో అనేక సార్లు మోడీని ప్రశంసించాడు. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాన్ని మెచ్చుకొన్నాడు. కాంగ్రెస్ అధినాయకత్వానికి కోపం వస్తుందని తెలిసినా కూడా శశి మోడీ తీరును మెచ్చుకొన్నాడు. అయితే కొంతమంది శశి మీద సందేహం వ్యక్తం చేశారు. ఆయన భార్య హత్య మిస్టరీగా మారిన నేపథ్యంలో శశి ఏమైనా ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మోడీని ప్రశంసిస్తున్నాడేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు.


ఎంపీ కల్వకుంట్ల కవిత 


ఇలాంటి నేపథ్యంలో మరోసారి మోడీని శశిని పొగడటం ఆసక్తికరంగా ఉంది. ఈ పొగడ్తలకు హైదరాబాదే వేదిక! తాజాగా శశిథరూర్ రచించిన పుస్తకం ఒకటి హైదరాబాద్ లో ఆవిష్కృతం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కవిత- శశిల మధ్య ఆసక్తికరమైన సంవాదం జరిగింది. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రస్తావన


కవిత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రస్తావన తీసుకు వస్తూ.. మోడీని  మహాభారతంలోని ఏ పాత్రతో పోల్చవచ్చు? అంటూ శశిని అడిగింది. దీనిపై శశి స్పందిస్తూ 'ఏకలవ్యుడు' అనే సమాధానాన్ని ఇచ్చాడు! మరి మహాభారతంలో ఏకలవ్యుడిది పాజిటివ్ పాత్ర. స్ఫూర్తికి మరో పేరు! అలాంటి పాత్రతో మోడీని పోల్చడం అంటే అది కచ్చితంగా ప్రశంసే అవుతుంది!


టీఆర్ఎస్ ఎంపీ మోడీ ప్రస్తావన


ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా మోడీని ప్రశంసించడం.. టీఆర్ఎస్ ఎంపీ మోడీ ప్రస్తావన తీసుకురావడం.. వీళ్లిద్దరూ ఉమ్మడిగా మోడీని మోసేయడం విశేషమే. వీళ్లిద్దరూ ఇది వరకూ కూడా తమ ప్రశంసలతో మోడీని ఆకట్టుకోవడానకి ప్రయత్నించిన వారే! ఇప్పుడు మరో ట్రయల్ వేశారంతే!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: