ప్రత్యేక హోదాతో... 5 లక్షల కోట్లు..!?
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు..
ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో.. హామీని సాధించేందుకు రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. టెక్నికల్ అంశాలను సాకుగా చూపుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ముఖం చాటేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఉద్యమిస్తేనే హోదా..
ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. టీడీపీతో కొనసాగాలా.. జగన్ తో వెళ్లాలా అని బీజేపీ ఆలోచిస్తోందని.. అందుకే హోదా విషయంలో జాప్యం చేస్తోందని ఆయన అన్నారు. హోదా కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.