ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ప్రమాదం : ఇద్దరికి గాయాలు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆయన శనివారం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద సీఎం కాన్వాయ్లోని ఓ వాహనం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన జీపును  ఢీకొంది. దాంతో జీపులో ఉన్న ఇద్దరు రోప్ పార్టీ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా యాదగిరిగుట్టలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. కొండపైకి ఇతర వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: