మంచిమాట: బద్ధకం మనిషి ప్రాణాలనే తీస్తుంది.!!

Divya
ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసి మెలసి ఎంతో హాయిగా ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం చాలా బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటలకు ఒప్పుకునేది కాదు. నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది.. ఒక రోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని ... సరే, జింక తాను చురుకైన దానిని అని వాదిస్తోంది కాబట్టి... దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను.

ఒక పెద్ద దుంపలు మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి కుందేలూ, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలుకాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా... ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు వద్ద కూర్చుండి పోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ, తుప్పనూ, బండనూ వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ  దుంప ఆ జింక కూర్చున్న చెట్టు తొర్ర లోనే ఉంది! జంతువులన్నీ {{RelevantDataTitle}}