ఇలాంటి నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే అదే గెలిచినంతన్న విషయం తెలిసిపోతోంది. కాకపోతే గెలుపు తమదేఅని, గెలవబోయేది బీజేపీ అభ్యర్ధే అని ఉత్త సొల్లు చెబుతున్నారు కమలనాదులు. ఇలాంటి సమయంలోనే కేంద్రప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నెత్తిన పాలుపోసిందనే చెప్పాలి. ఎలాగంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఖాయమైన దగ్గర నుండి ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదే తిరుపతి బహిరంగసభలో 2014లో ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని నరేంద్రమోడి ప్రకటించారు. తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని తుంగల