సెకండ్ టెస్ట్ ఫస్ట్ సెషన్ వాష్ అవుట్...!
ఈ మ్యాచ్కు కివీస్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. మోచేతి గాయం మరోసారి తిరగబెట్టడంతో... కివీస్ మేనేజ్ మెంట్ కేన్కు విశ్రాంతి ఇచ్చింది. 2021 సీజన్లో మోచేతి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా సరే అటు ఐపీఎల్, టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఆడాడు. కేన్ గైర్హాజరీతో టామ్ లాథమ్ ఈ మ్యాచ్ కోసం కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ టోర్నీతో పాటు పలు కీలక టోర్నీలను కివీస్ ఆడనుంది. ఇందుకోసమే కేన్కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు తొలి టెస్టు మ్యాచ్లో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన భారత్ జట్టు... చివరి వికెట్ తీయడంతో విఫలమైంది. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ 20 సీరిస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... ఈ టెస్టు మ్యాచ్ కూడా గెలిచి... టెస్ట్ సిరీస్లో తమదే పై చెయ్యి అని వెల్లడించేలా ఉంది. తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ... ముంబై టెస్టు కోసం అందుబాటులో ఉన్నాడు.