ఇది సర్ ధోని అంటే.. అభిమానులు గర్వపడే పనిచేశాడు?
ఇప్పటికే ఎన్నోసార్లు తన అభిమానులను కలిసిన ధోని ఇక ఇటీవల ఒక ప్రత్యేకమైన అభిమాని కోరిక తీర్చాడు. పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్యకు ధోని అంటే విపరీతమైన అభిమానం. ఈ క్రమంలోనే ధోని బొమ్మను గీసి అతనికి బహుమతిగా ఇవ్వాలని ఎంతగానో ఆశ పెట్టుకుంది. అయితే ఈ విషయం మహేంద్రసింగ్ ధోని కి తెలిసింది. అభిమానులు అంటే ప్రాణం ఇచ్చే ధోని ఊరుకుంటాడా స్వయంగా లావణ్య దగ్గరికి వెళ్లి కలిశాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత లావణ్య తన అభిమాన క్రికెటర్ ధోనీ కి సంబంధించి గీసిన బొమ్మ ను అతనికి బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం కన్నీళ్లను తుడవటం.. అంతేకాకుండా లావణ్య తన బొమ్మను గీసినందుకు అభినందనలు తెలిపాడు. ఇక ఈ మధురమైన క్షణాలను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఆయన చేతులు తడుముతూ ఏడవకూడదు జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటూ చెప్పారు. బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసి ధోని అభిమానులందరూ మరింత గర్వపడుతున్నారూ అనే చెప్పాలీ.