ఇంగ్లాండ్ తో టెస్ట్.. ఓపెనింగ్ ఆ ఇద్దరిలో ఒకరైతే బెటర్?
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ టీమిండియా కు అందుబాటులో ఉండక పోతే ఇంగ్లాండ్ తో టెస్ట్ కి ఓపెనర్గా ఛటేశ్వర్ పూజారా లేదా హనుమ విహారిని ఎంచుకోవాలి అంటూ సూచించాడు. ఇక ఏకైక టెస్టు మ్యాచ్లో అనుభవం ఉన్న ప్లేయర్లను బరిలోకి దింపాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.మయాంక్ అగర్వాల్ కి తగినంత నెట్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అతను సిద్ధంగా ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అయితే కేఎస్ భరత్ ను మాత్రం ఓపెనర్గా కన్సిడర్ చేయకపోవడం గమనార్హం. విహారి ఇప్పటికి భారత్ తరపున రెండుసార్లు ఓపెనింగ్లో దిగాడు. ఇక పూజారాకు కూడా ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అందుకే ఇద్దరు అనుభవజ్ఞులైన ప్లేయర్లను ఓపెనర్లుగా పంపిస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల సోనీ స్పోర్ట్స్ తో మాట్లాడిన అజిత్ అగార్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే అటు టీమిండియా బూమ్రా కెప్టెన్సీ లో బరిలోకి దిగబోతోంది అన్నది తెలిసిందే. అయితే టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారబోతుంది.