జోస్యం చెప్పిన రికీపాంటింగ్.. ఆసియా కప్ లో విన్నర్ ఎవరంటే?
ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే పోరులో విజేత ఎవరు అనే విషయం పై జోస్యం చెప్పారు. ఇంకో 15 -20 ఏళ్ళు అయినా సరే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. క్రికెట్ చరిత్రలో ఈ ఇరు జట్లు కూడా ఎప్పటికీ చిరకాల ప్రత్యర్తులుగానే అభిమానులు చూస్తూ ఉంటారు. క్రికెట్ లవర్ గా నేను చెప్పేది ఏమిటంటే ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థులు గానే చూసినప్పటికీ ఇవి కేవలం యాషెస్ సిరీస్ వరకు మాత్రమే పరిమితం. కానీ భారత్ పాకిస్తాన్ ఆధిపత్య ధోరణి అలా ఉండదు వన్డే టెస్ట్ టి20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులు గానే ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆసియా కప్లో 13 సార్లు తలపడితే భారత ఏడు సార్లు పాకిస్తాన్ ఐదు సార్లు గెలిచింది. అందుకే ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియాకి నా ఓటు అంటూ రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.
అయితే గతంలో భారత జట్టు పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఇక ప్రస్తుతం ఇరు జట్ల కూడా సమాన బలంతో కొనసాగుతున్నాయని ఈ క్రమంలోనే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో విజేత ఎవరు అనేది చెప్పడం కూడా చాలా కష్టమైంది అంటూ వ్యాఖ్యానించాడు రికీపాంటింగ్.